Akhanda: అఖండ విడుద‌ల‌పై క్రేజీ అప్డేట్.. షూటింగ్ పూర్తి.. ఎప్పుడంటే!

-

Akhanda : నంద‌మూరి నట సింహా బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) క్రేజీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘అఖండ’ (Akhanda). ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. అఖండ‌ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యిందని మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చివరి షెడ్యూల్ లో భాగంగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను, భారీ ఫైట్స్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తం షూటింగ్ పూర్తవడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు.

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ త‌ర్వ‌త బాలకృష్ణ,బోయపాటి కాంబినేష‌న్లో వ‌స్తున్న‌చిత్రం కావ‌డంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే విడుదలైన ’అఖండ’ టైటిల్ పోస్టర్‌, టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నారట‌.

ఒకటి కలెక్టర్ పాత్ర అయితే. .రెండోది ఫ్యాక్షనిస్ట్, మూడోది అఘోర అని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇండ‌స్ట్రీలో టాక్ వ‌చ్చింది. ఈ విషయమై ఈ బుధవారం అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

ఇప్ప‌టికే డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ను భారీ మొత్తంలో అమ్మిన‌ట్టు తెలుస్తుంది. ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు , నైజాం రూ. 10 కోట్లుకు, సీడెడ్ రీజియన్ రూ .12 కోట్లకు అమ్ముడు పోయిన‌ట్టు తెలుస్తుంది. అయితే.. ఇక అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news