‘సైమా’ అవార్డ్స్ లో గర్జించిన బాలయ్య “అఖండ”

-

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. ఈ చిత్రం ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బాలయ్య నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే పెద్ద విజయాన్ని అందించింది.

దీంతో ఈ సినిమా సీక్వెల్ పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ -2 సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా.. తాజాగా జరిగిన సైమా లో అఖండ మూవీ గర్జించింది. బెస్ట్‌ నటుడిగా బాలయ్యకు ఉత్తమ నటుడుగా అవార్డు రాగా.. బెస్ట్‌ ఫీమేల్‌ సింగర్‌ గా జై బాలయ్య సాంగ్‌ కు గానూ గీతా మాధురికి అవార్డు వచ్చింది. అలాగే.. సినిమాటో గ్రాఫర్‌ రామ్‌ ప్రసాద్‌ కు ఉత్తమ సినిమా సినిమాటోగ్రఫీ అవార్డు వరించింది.

Read more RELATED
Recommended to you

Latest news