దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడు నాయకుడా..? జగన్ కి బాలయ్య వార్నింగ్..!

-

దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వాడు ప్రజానాయకుడు ఎలా అవుతాడని ఇకమీదట దళితుల మీద దాడులకి పాల్పడితే ఊరుకునేది లేదని జగన్ కి హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. సత్యసాయి జిల్లా హిందూపూర్ రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజా ధనాన్ని వైసిపి నాయకులు పందికొక్కుల్లా మెక్కారని మండిపడ్డారు.

కేవలం పబ్లిసిటీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 వేల కోట్ల సిద్ధం హోల్డింగ్ లు పెట్టుకున్నారని బాలయ్య అన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన కావాలా ప్రజల సంక్షేమ పాలన కావాలో ప్రజలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత వేరే మార్గంలోకి వెళ్తున్నారని ఆరోపించారు. చిన్నవయసులోనే గంజాయి డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారని అన్నారు వైసిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఎస్సీల మీద దాడులు అత్యాచారాలు ఎక్కువైపోయాయి అని అన్నారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news