బరిదేగించి “ఏక్‌ నిరంజన్‌” లాగా కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాడు : బండి సంజయ్

-

“ఏక్‌ నిరంజన్‌” లాగా కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాడని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని.. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ లు తెలియచేయడానికి మీడియా ద్వారా తెలిపాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి చేస్తున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర లో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని…. ముఖ్యమంత్రి బరిదేగించి ఉన్నాడు.. తుగ్లక్ లాగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.


రాష్ట్రపతి ఇచ్చిన జి ఓ ను 36 నెలల లోపట పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహించారని.. ఉద్యోగస్తులకు గోస పట్టుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. దుర్మార్గం ఐన ఆలోచనతో ఉద్యోగస్తులు గందరగోళం శృష్టించి బదిలీ లు కూడా వెంటనే జాయిన్ కావాలని ఆదేశాలు జరిచేయటం వల్ల వారి కుటుంబం చిన్న బిన్నం అవుతుందని మండిపడ్డారు.

స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని చెప్పారు కానీ ఎలా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారని.. అనారోగ్యం తో ఉన్న ఉద్యోగస్తులకు ఇబ్బందులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఉద్యోగస్తుల సమస్యల పై స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే బిజెపి పార్టీ ఆందోళన చేపడుతుందని.. బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఉద్యోగస్తుల సమస్యల పట్ల దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news