Bandi Sanjay : పొన్నం ప్రభాకర్ పోలైట్ గా మాట్లాడాలి….

-

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్ర స్వామిని ఎంపీ బండి సంజయ్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆలయ పూజారులు, అధికారులు గుట్టపై వున్న శివాలయం శిథిలావస్థలో వుందని చెప్పడంతో ఎంపీ నిధులు నుండి కొండపైన ఉన్న గుడి అభివృద్ధి కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తా అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. కేటీఆర్ కు ఉన్న అహంకారం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఉందని అన్నారు .కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎలా నాశనం అయిందో, రేపు పొన్నం ప్రభాకర్ అహంకార మాటలతో కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే నాశనం అవుతుందని ఆయన అన్నారు. నేను సంస్కారంతో మాట్లాడుతున్న కావున పొన్నం ప్రభాకర్ కూడా పోలైట్ గా మాట్లాడాలని బండి సంజయ్ అన్నారు.

 

కార్యకర్త కోరిక మేరకు ఓ కారు ప్రారంభం చేస్తే, వాళ్ళు బండి సంజయ్ దే అని ముడిపెట్టి చిల్లర రాజకీయం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడే పోటీ చేస్తా, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తము, గల్లీలో ఏ పార్టీ వున్న కేంద్రంలో మాత్రం మోడీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news