రోహింగ్యాలను తరిమికొడితే మీకేం నొప్పి కేటీఆర్ ?

-

బీజేపీ వ్యక్తి మేయర్ అయితే పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న రోహింగ్యాలను తరిమి కొడతాం అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం మీద కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు. మనమేమన్నా పాకిస్తాన్ లో ఉన్నామా లేకపోతే హైదరాబాద్ పాకిస్తాన్ లో ఉందా ఈ సర్జికల్ స్ట్రైక్ చేయటం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ క్రమంలో బండి సంజయ్ మళ్లీ అలాంటి వ్యాఖ్యలు చేశారు రోహింగ్యాల ను, పాకిస్థాన్ వాళ్లని తరిమి కొట్టాలా లేదా? సర్జికల్ స్ట్రైక్ చేయాలా లేదా ? అని ప్రశ్నించారు. వాళ్ళ ఓట్లతో గెలిచే గెలుపు ఒక గెలు పేనా అలా గెలవడానికి సిగ్గుండాలి అని ఆయన అన్నారు. 12 శాతం మైనారిటీ ల సంతుష్టికరణ కోసం పనిచేస్తున్న నీది సెక్యులర్ పార్టీ అయితే 80 శాతం హిందువుల కోసం మాట్లాడుతున్న బీజేపీ మతతత్వపార్టీనా అది ఎలా అలా అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ సర్ ట్వీట్ చేశారని, రోహింగ్యాల ను ఇక్కడి నుండి తరిమిస్తే నీకు నొప్పి ఏంట అని అడుగుతు న్నానని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news