కేసీఆర్ కు మందు పోయడానికి.. టీఆర్ఎస్ నేతలే క్యూ కడుతున్నారు : బండి సంజయ్ కౌంటర్

-

సీఎం కేసీఆర్ కి ఈడీ దాడుల భయం పట్టుకుందని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ని పార్టీలో మంత్రి కావాలనుకున్నవాళ్లు నీకు మందు పోస్తారు నాకేం అవసరమని ప్రశ్నించారు. మందు కలిపితే మంత్రి అవుతారని తెలిస్తే టీఆరెస్ ఎమ్మెల్యేలు మందు కలపడానికి ప్రగతి భవన్ ముందు క్యూ కడుతారంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ టైం వెస్ట్ కాదు… టైం పాస్ చేస్తాడని మండిపడ్డారు. కేసీఆర్ కి రైతుల కోసం ఆందోళన చేసే సమయం ఉండదని… కేవలం టైం పాస్ చేయడానికే టైం కేటాయిస్తాడంటూ ఫైర్‌ అయ్యారు.అందుకే ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నాడని… వర్షాలతో రైతులు భయపడుతుంటే ప్రభుత్వం ధర్నాలు చేస్తుందన్నారు. వానాకాలం పంట కొనుగోలు చేస్తార లేదా…? చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ ఆందోళనలు ఎందుకు చేశారో అర్థం కావడం లేదని…. టీఆరెస్ నేతలు రైతు సమస్యల పై ధర్నాలు చేస్తున్నారా…? లేక అంతర్జాతీయ సమస్య కోసమా…? అని నిలదీశారు. ధర్నాలకొచ్చిన వల్లే సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటున్నారు.. వాళ్ళు వాస్తవ విషయాలు తెలుసుకున్నట్లు ఉన్నారని తెలిపారు. మా వల్లే… టీఆరెస్ రోడ్డే క్కింది… ఇక టీఆరెస్ భవిష్యత్తు రోడ్డు పైనేనని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version