నేను నమిలేది లవంగాలు… తంబాకు కాదు : బండి సంజయ్

-

టీఆర్ఎస్ లో కొందరు మూర్ఖులు నేను తంబాకు తింటానని విష ప్రచారం చేస్తున్నారని… నేను నమిలేది లవంగాలని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. మద్యం, డ్రగ్స్ అలవాటున్నది టీఆర్ఎస్ నేతలకేనని… కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు వెంట్రుకలను పరీక్షిస్తే డ్రగ్స్ భాగోతం బయటపడతదని ఫైర్ అయ్యారు.

అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగింది. మీరా దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేసేది. మీకా నైతిక అర్హతే లేదన్నారు.

ఇతరుల చావును కోరుకునే మూర్ఖులు టీఆర్ఎసోళ్లు అని మండిపడ్డారు. బండి సంజయ్ చస్తే కూడా రైతు బీమా వస్తుందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని… నాకు గుంట భూమి లేదు. రైతు బీమా ఎట్లిస్తరు? నాచావును కోరుకునే మూర్ఖులకే ఆ ఇన్సూరెన్స్ డబ్బులిస్తానని చురకలు అంటించారు. కేసీఆర్ అరాచకాలపై పోరాడదాం రండి. ఎత్తిన జెండా దించకండి. తెగించి కొట్లాడండి. గొల్ల కొండ కోటపైన కాషాయ జెండా ఎగరేసేదాకా ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news