బ్రేకింగ్ ; బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

-

ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీ సీనియర్‌ నాయకులు కళ్యాణ్‌ సింగ్‌ అనారోగ్యం తో నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే… కళ్యాణ్ సింగ్ మరణం తో పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసింది బీజేపీ పార్టీ. అంతేకాదు.. మూడు రోజులు సంతాప దినాలు గా ప్రకటించింది బీజేపీ పార్టీ.

అయితే… బీజేపీ పార్టీ తాజా నిర్ణయం తో పాద యాత్ర వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రకటించారు. అయితే… ఈ నెల 24 నుంచి అంటే ఎల్లుండి నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తాజాగా ఆయన వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే దీనిపై కొత్త తేదీ ని ప్రకటిస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్‌ కుమార్‌. అలాగే… మాజీ సైనికాధికారులు పార్టీలో చేరిక కార్యక్రమం వాయిదా వేసుకున్న బీజేపీ పార్టీ రక్షా బంధన్ వేడుకలు కూడా రద్దు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news