నాకు ఇంగ్లీష్, హిందీ రాదు..కానీ : బండి సంజయ్

-

తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కెసిఆర్ అన్నాడని…తనకు ఆ భాషలు రాకున్నా.. తాను పేద ప్రజల గురించి చదువుకున్నానని పేర్కొన్నారు బండి సంజయ్. పేదల కష్టాలు చదువుకున్నా..  తన చదువు సంస్కారం, సభ్యత నేర్పిందని బండి సంజయ్.. కెసిఆర్ కు చురకలు అంటించారు. తాగుత తగిపిస్తా అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు…మందు తాగి బండి నడిపితే తప్పు అయితే.. మందు తాగి రాష్ట్రాన్ని నడపడం తప్పు కాదా ? అని ప్రశ్నించారు బండి సంజయ్.

తెలంగాణ కి మొదట మోసం చేసింది కేసీఆర్ అని.. కృష్ణా జలాల విషయం లో 299 టీఎంసీ లకు ఒప్పుకుని సంతకం చేసింది నువ్వు కాదా ? అని నిలదీశారు. రాయలసీమ ను రతనాల సీమ చేస్తా అనలేదా.. చేప పులుసు తిని రాలేదా ? ఫెడరల్ ఫ్రంట్ అంటివి ఏమైంది ? అని కెసిఆర్ ను ప్రశ్నించారు.

80 వేల పుస్తకాలు చదివి మోసం చేయడం ఎలానో నేర్చుకున్నావా ? ఎప్పుడు తల నరుకుతావో చెపుతావో చెప్పు.. నక్సలైట్ లకు భయపడలేదు.. నీకు భయపడతామా ? అని సవాల్ విసిరారు. మా కార్యకర్తలు చేసిన త్యాగం లో నువ్వు చేసింది ఎంత… ? 14 వందల తెలంగాణ అమర వీరుల త్యాగాలను మోసం చేశావని మండిపడ్డారు. . బహిరంగ సభ పెడతామంటే రైతులు తిరగ బడుతున్నారని.. దేశం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదువులో పెట్టుకొని మాట్లాడు అని మండిపడ్డారు. బీజేపీ మతతత్వ రగిలిస్తుంది అంట… mim సెక్యులర్ పార్టీ నా ? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news