చివరి టెస్టుకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

-

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండియా – ఇంగ్లండ్‌ మధ్య చివరి టెస్టు.. మార్చి 07 నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అయితే ఇంగ్లండ్ తో జరిగే ఐదో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. బుమ్రా తిరిగి జట్టులోకి రాగా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యారు.ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఇంకా సిరీస్ లో ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడా తో సిరీస్ ని సొంతము చేసుకుంది.ఇదిలా ఉంటే… హైదరాబాద్‌ టెస్టులో ఆడి ఆ తర్వాత గాయంతో వెనుదిరిగిన కేఎల్‌ రాహుల్‌ త్వరలోనే లండన్‌ వెళ్లనున్నట్టు బీసీసీఐ పేర్కొంది.

ఐదో టెస్టుకు ఇండియా టీం : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రిత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌,యశస్వీ జైస్వాల్‌, రజత్‌ పాటిదార్‌, ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్‌), కెఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), సర్ఫరాజ్‌ ఖాన్‌,ఆర్‌. అశ్విన్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌,ముకేష్‌ కుమార్‌,దేవదత్‌ పడిక్కల్‌, ఆకాశ్‌ దీప్‌.

Read more RELATED
Recommended to you

Latest news