బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్..

-

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఛత్రపతి హిందీ రీమేక్ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడని వినిపించింది. తాజాగా ఈ విషయమై అధికారిక సమాచారం వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలోకి అడుగుపెడుతున్నాడు. తెలుగులో తన మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన వినాయక్ గారికే బాలీవుడ్ లోనూ అవకాశం ఇస్తున్నాడు.

పెన్ మూవీస్ బ్యానర్ లో జయంతి నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. తెలుగులో రాక్షసుడు సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ తెలుగు చిత్రాలు హిందీలోకి అనువాదం అయ్యి మంచి వ్యూయర్ షిప్ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ లోకే అడుగుపెడుతున్న బెల్లంకొండకి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news