BREAKING : భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

-

ప్రీ వెడ్డింగ్ షూట్​కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. కారు-లారీ ఢీకొనంతో ఈ ప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్‌ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో క్షతగాత్రుడు రణధీర్‌ను చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. మృతులు హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్‌, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్‌, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం వీరంతా మోతేకి వెళుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version