అద్వానీకి భారతరత్న.. బీజేపీకి దక్కిన గౌరవం: కిషన్ రెడ్డి

-

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు లాల్‌కృష్ణ అద్వానీకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ విషయాన్ని స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్(ఎక్స్) లో వెల్లడించారు. అద్వానీ భారతరత్నకు ఎంపిక అవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.అద్వానీకి భారతరత్న ఇవ్వనున్న విష‌యాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని.. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని.. అట్ట‌డుగు స్థాయి నుండి దేశ ఉప ప్ర‌ధాన‌మంత్రిగా సేవ చేయ‌డంతో ఆయ‌న జీవితం ఇన్సిరేషన్ గా నిలిచిందని ఆయన అన్నారు.  అంతేకాకుండా పలువురు ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూ…దేశ అభివృద్ధికి అద్వానీజీ చేసిన కృషిని మరువలేమంటూ ఆయనని కొనియాడారు.

ఇదిలా ఉంటే …సీనియర్ బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి స్పందించారు. బీజేపీని బలోపేతం చేయడంలో అద్వానీ కీలకపాత్ర పోషించారని అన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇది బీజేపీ కార్యకర్తలందరికీ దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

Read more RELATED
Recommended to you

Latest news