‘భీమ్లానాయక్’ సీక్వెల్ పై రానా క్లారిటీ…

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘ భీమ్లా నాయక్’ భారీ హిట్ కొట్టింది. కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతోంది. థియేటర్ల విడుదలైన ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. హిట్ టాక్ సొంత చేసుకుని రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. పవన్ కళ్యాణ్ కు పోటీగా రానా తనదైన నటనను కనబరిచాడు. ఇద్దరు కూడా నువ్వా… నేానా అన్న రీతిలో యాక్టింగ్ లో ఇరగదీశారు.

అయితే ఓ సినిమా హిట్ అయిందంటే.. దానికి సీక్వెట్ ఉంటుందా…? అని ప్రచారం జరుగుతుంటుంది. అయితే ఈ ప్రచారంపై రానా క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ‘‘భీమ్లానాయక్ కు సీక్వెల్ ఉంటుందని నేను అనుకోవడం లేదని… కథ ఎక్కడ ముగియాలో అక్కడే ముగిసింది.”స్పష్టత ఇచ్చాడు.

సాగర్ కే.చంద్ర డైరెక్షన్ లో వచ్చి ఈసినిమాకు మాటలు, స్క్రీన్ ప్లేను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిచారు. థమన్ మ్యూజిక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, రానాలకు జోడీగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రిమేక్ గా భీమ్లా నాయక్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news