Bhumika: పవన్ కల్యాణ్ ‘ఖుషీ’కి 21 ఏళ్లు.. ‘మధు’ పాత్రపై భూమిక స్పందన ఇదే

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఖుషీ’కి 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్లు గడవగా, ఈ చిత్రం పై హీరోయిన్ భూమిక స్పందించారు. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో కాగా, హీరోయిన్ గా ‘మధు’గా భూమిక నటించింది.

ఈ చిత్రం తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమాలు చాలా కాలం పాటు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయితే, ‘ఖుషీ’ మూవీ మాత్రం టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.

‘ఖుషీ’కి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భూమిక ట్విట్టర్ వేదికగా స్పందించింది.ఈ పిక్చర్ లో ‘మధు’గా త‌న‌కు ద‌క్కిన గుర్తింపును తెలిపింది. ట్వీట్ లో ‘ఖుషీ’ చిత్ర దర్శకుడు ఎస్.జే.సూర్య, ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు థాంక్స్ చెప్పింది. భూమిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతున్నది. తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది భూమిక.

ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news