భువనగిరి శివారులో దారుణం..బైక్ తో సహా మంటల్లో కాలిన వ్యక్తి..!

-

భువనగిరి శివారులో దారుణం చోటుచేసుకుంది. ఇక అసలుకు ఏమైంది అనే విషయానికి వచ్చేస్తే బైక్ తో పాటుగా మంట లో కాలిపోయాడు ఒక వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారు లో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి మీద సోమవారం దారుణం జరిగింది. ద్విచక్ర వాహనంతో సహా వ్యక్తి మంటల్లో కాలిపోయాడు ఇది గమనించి స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు.

సమాచారం అందుకున్న భువనగిరి రూరల్ సిఐ ప్రభాకర్ రెడ్డి ఎస్సై తో పాటుగా ఘటన స్థలానికి వెళ్లారు అక్కడ మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కాగజ్నగర్ కి చెందిన నాగరాజుగా గుర్తించారు. వృత్తిరీత్యా నాగరాజు హైదరాబాద్ లో ఉంటున్నాడు సంఘటన స్థలంలో క్లూస్ టీం ద్వారా ఆధారాలని సేకరిస్తున్నారు హత్య ఎవరైనా చేశారా లేకపోతే ఆత్మహత్య అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నాగరాజు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని పోలీసులు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news