చంద్రబాబు వద్దు అంటున్నా భువనేశ్వరి తీసుకున్న ఆ నిర్ణయానికి సెల్యూట్ !!

-

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా దీక్షలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా దీక్షలో పాల్గొని దీక్ష చేస్తున్న వాళ్ళ ఖర్చులకు తన చేతి గాజులను విరాళాలుగా ఇవ్వటం జరిగింది.

ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్న నేపథ్యంలో భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు చంద్రబాబు వద్దు అని అంటున్నా భువనేశ్వరి మాత్రం  తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే కచ్చితంగా ఈ టైంలో నా ఎంట్రీ అవసరమని గట్టిగా చెప్పటంతో కృష్ణా జిల్లా నుండి ఎన్టీఆర్ వారసురాలిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి భువనేశ్వరి స్కెచ్ మొత్తం సిద్ధం చేసుకున్నట్లు..

 

ఎలాగో గన్నవరం నియోజకవర్గంలో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అదే ప్రాంతం నుండి టిడిపి తరఫున నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి భువనేశ్వరి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Latest news