బిగ్ బాస్ షో 7 సీజన్ కంటెస్టెంట్ లతో మరింత దిగజారేలా ఉందా.!

-

బిగ్ బాస్ గేమ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్, ఎందుకంటే మన పక్కింటి వాళ్ళు కొట్టుకుంటే నే చూసే మనం ఇక సెలబ్రిటీలు కొట్టుకుంటూ ఉంటే ఉండగలమా. అదే బిగ్ బాస్ షో కు రేటింగ్స్ రావడానికి ప్రధాన కారణం. ఇక గత సీజన్స్ తో పోల్చితే  ఈ సీజన్ మరీ దారుణంగా ఉందని నెటిజన్స్ దొమ్మెత్తి పోశారు.ఇక రేటింగ్స్  గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఇక బిగ్ బాస్ షో సీజన్స్ లో మొదటి మాత్రం సూపర్ హిట్ అయ్యింది, ఈ సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండటం, బిగ్ బాస్ కొత్త కాబట్టి నిజమయిన సినిమా, టీవి సెలబ్రిటీలు కంటెస్టెంట్లు గా రావటం తో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.అలాగే నాలుగు సీజన్స్ వరకు బిగ్ బాస్ షో బాగానే అలరించింది.ఇక ఆరో సీజన్ అయితే దారుణంగా ఉందని కామెంట్స్ వచ్చాయి.

ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 పార్టిసిపేట్ చేసే వారి ఎంపిక స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది.  ఇప్పుడు సీజన్ 7 హౌస్ లోకి వెళ్ళేది వీరే అని కొంతమంది పేర్లు ఇప్పటి నుంచే వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో టిక్ టాక్ ద్వారా ఫెమస్ అయిన దుర్గారావు పేరు వినిపిస్తోంది. అలాగే ఈటివి లో ఢీ షో లో  యాంకర్ గా చేసి ఇప్పుడు హీరోయిన్  వేషాలు వేస్తున్న గాను చేసిన దీపికా పిల్లి, నయన పావని, వైష్ణవి చైతన్య , జబర్ధస్ వర్ష, పవిత్ర లు హౌస్ లోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇక కపుల్ లో అమర్ దీప్, తేజస్వని దంపతులు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బిగ్ బాస్ షో రేటింగ్ డబల్ డిజిట్ నుండి  ఏకంగా సింగిల్ డిజిట్ కు పడిపోయింది. ఇక ముందు ముందు ఇంకెంత దారుణంగా ఉంటుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news