బిగ్ బ్రేకింగ్; మారుతీ రావు ఆత్మహత్య…!

-

ప్రణయ్ హత్య కేసు నిందితుడు, అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య చేసుకున్నారు. చింతల్ బస్తీ లోని ఆర్య వైశ్య భవన్ లో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ని ఆయన హత్య చేయించారు. హైదరాబాద్ లోని చింతల్ బస్తీ లో ఉన్న ఆర్య వైశ్య భవన్ లో ఆయన నిన్న రాత్రి ఒక గది తీసుకుని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వారం క్రితం మారుతీ రావు షెడ్ లో ఒక మృతదేహం లభ్యం అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే ప్రణయ్ హత్యకేసులో ఒత్తిళ్ళ వలనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఆయన భార్య కూడా పోలీసులకు ఇదే విషయంలో ఫిర్యాదు చేసారు. ప్రణయ్ హత్య కేసుకి సంబంధించి అమృత తో ఆయన రాజీకి వచ్చారని కానీ అమృత మాత్రం అందుకు అంగీకరించలేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.

ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. ప్రణయ్ హత్య కేసులో ఆయన పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయన కొన్నాళ్ళ పాటు జైల్లో ఉండి బయటకు వచ్చారు. కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకున్న నేపధ్యంలో ఇష్టం లేక ఆయన హత్య చేయించారు. ఈ ఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news