అయ్యన్నకు హైకోర్టులో ఊరట..ఇంటి జోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు

-

అమరావతి : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హై కోర్టులో ఊరట లభించింది. అయ్యన్న పాత్రుడి ఇంటి జోలికి వెళ్లవద్దని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత పై తాజాగా హైకోర్టు స్టే వేశారు.

అయ్యన్న ఇంటి కూల్చివేత పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు… అర్థరాత్రి ముగిసిన వాదనలు. జలవనరుల శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ ఎటువంటి నోటీసు లేకుండా ఇల్లు కూల్చివేస్తున్నారని వాదనలు వినిపించారు.

దీంతో కూల్చివేతపై స్టే విధించిన హైకోర్ట్… తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఇంటి జోలికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఈ సమాచారాన్ని స్థానిక అధికారులకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ హై కోర్టు. కాగా.. నిన్న ఉదయం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను అధికారులు కూలగొట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news