ఈటలకు మరో షాక్… కీలక నేతలు జంప్

-

హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పార్టీలు… హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది.

ఆయన కు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్‌, చుక్కా రంజిత్‌… బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో పింగిలి రమేష్‌ సింగిల్‌ విండో వైఎస్‌ ఛైర్మన్‌ కూడా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. కాగా.. ఇప్పటికే హుజురాబాద్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా గెల్లు శ్రీనువాస్‌ ను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించగా… బీజేపీ మరియు కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించ లేదు. బీజేపీ పార్టీ తరఫున ఈటల రాజేందర్‌ బరిలో ఉండే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news