ఏపీలో “అఖండ” సినిమాకి బిగ్ షాక్.. థియేటర్ సీజ్ !

-

ఇవాళ నందమూరి బాలకృష్ణ నటించిన “అఖండ” సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో.. అఖండ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు సినీ ప్రియులు. అయితే తాజాగా ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. కృష్ణా జిల్లా మైలారం లో బాలకృష్ణ నటించిన ఈ అఖండ సినిమా ఆగిపోయింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇవాళ తెల్లవారు జామున ఎనిమిది గంటలకు బెనిఫిట్ షో వేశారని… మైలారం లోని సంఘమిత్ర థియేటర్ ఎమ్మార్వో సీజ్ చేశారు.

అనుమతి లేనిదే ఎలా బెనిఫిట్ షోలు వేస్తారని.. థియేటర్ పై కేసులు నమోదు చేస్తామని ఎమ్మార్వో ఈ సందర్భంగా హెచ్చరించారు. రెండు స్క్రీన్లలో… రూల్స్ బ్రేక్ చేసిన స్క్రీన్ ను మాత్రమే సీజ్ చేశామని… మరో స్క్రీన్ నడుస్తోందని ఎమ్మార్వో తెలిపారు.

కాగా ఇటీవలి కాలంలోనే… ఏపీలో బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఏపీలో తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news