ఏపీ సీఎం జగన్ అక్ర‌మ ఆస్తుల కేసులో బిగ్ ట్విస్ట్‌..!

-

ఏపీ సీఎం జగన్ అక్ర‌మ ఆస్తుల కేసు ఇంకా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా… ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. ఆస్తుల కేసులో జగన్ హాజరు కు మినహాయింపు ఇవ్వొద్దని ఈ సంద‌ర్భంగా హై కోర్టును కోరింది సీబీఐ. సీఎం జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని వాదించింది సీబీఐ. సాక్షులను ప్రభావితం చేస్తారనే హాజరు మినహాయింపునకు గతంలో హైకోర్టు నిరాకరించిందని ఈ సంద‌ర్భంగా సీబీఐ గుర్తు చేసింది.

సీఎం జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంద‌ని సీబీఐ అధికారులు హై కోర్టు కు వెల్ల‌డించారు. పదేళ్లయినా కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయని సీబీఐ వివ‌రించింది. హాజరు మినహాయింపు ఇస్తే విచారణ మరింత జాప్యం అవుతుందని సీబీఐ వెల్ల‌డించింది. సీబీఐ కోర్టులో జగన్ హాజరు మినహాయింపు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news