బిగ్ బాస్ 7: శోభా టేస్టీ తేజను వాడుకుంటోందా ?

-

బిగ్ బాస్ సీజన్ 7 లో రోజుకు ఒక్క కొత్త గొడవ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి చూస్తోంది. కానీ ముందే ప్లాన్ చేసినట్లుగా ఉంటున్న ఈ సీన్ లతో కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం చాలా విసుగు చెందుతున్నారు. ఇక నిన్న ఎపిసోడ్ లో శోభా శెట్టి అమర్ గురించి తేజ తో గొడవ పెట్టుకుంది, ముందుగా బిగ్ బాస్ పెట్టిన బాక్స్ లను అరేంజ్ చేసే గేమ్ లో గౌతమ్, ప్రశాంత్, యావర్ మరియు రాతికలు పాల్గొన్నారు. అందరికన్నా ముందు చేసి ప్రశాంత్ కెప్టెన్సీ రేస్ లో నిలబడగా.. ఆఖరి స్థానంలో నిలిచి రాతిక ఎలిమినేట్ అయింది. ఈ సందర్భంలో రతికను తేజ నువ్వు కూడా అన్నం తినకుండా అమర్ లాగా చెయ్యి అన్న అర్ధం వచ్చేలా అన్నాడు. ఈ విషయం విన్న శోభా శెట్టి వెంటనే తేజపై గొడవకు వెళ్లిపోయింది. ఇద్దరూ కొంచెం సేపు అరుచుకున్నాక.. తేజ మాత్రం చాలా బాదపడ్డాడు.

కానీ తర్వాత శోభ ఏమీ జరగనట్లు వచ్చి మాలీ తేజతో మింగిల్ అవడానికి చూసింది. ఇదంతా చూస్తుంటే తేజను కావాలనే బిగ్ బాస్ హౌస్ లో శోభ వాడుకుంటోందంటూ బయట కామెంట్లు వినబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news