బిగ్ బాస్: తిరగబడ్డ మెహబూబ్ ప్లాన్.. కెప్టెన్ గా కుమార్ సాయి.

-

బిగ్ బాస్ లో ఈ వారం కాయిన్స్ టాస్క్ బాగా జోరుగా సాగింది. సోహైల్, మెహబూబ్.. ఇద్దరూ కలిసి తమ వద్దనున్న కాయిన్స్ ని మరింత పెంచుకోవడానికి ఇతర కంటెస్టెంట్ల నుండి దొంగతనం చేసి మరీ దాచుకొన్నారు. కానీ దాచిందంతా దొంగల పాలు అన్నట్లుగా దొంగలు దాచిన కాయిన్స్ అన్నీ ఒక్క స్విచ్ కాయిన్ ద్వారా సుజాతకి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో మెహబూబ్, సోహైల్ కష్టం పూర్తిగా వృధా అయ్యింది. ఈ దెబ్బతో మెహబూబ్ కెప్టెన్సీ టాస్కు నుండి తొలగింపబడ్డాడు. అంతకుముందే సోహైల్, తన దగ్గరున్న కాయిన్స్ అన్నింటినీ మెహబూబ్ కి ఇచ్చేసాడు.

మొత్తానికి కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ ఓ ఆట ఆడించాడు. అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా ఎవ్వరూ ఊహించని రీతిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతాయన్న దానికి ఈ రోజు ఎపిసోడ్ ఒక ఉదాహరణగా నిలిచింది. కెప్టెన్సీ పోటీదారులలో కుమార్ సాయి, సుజాత, హారిక, అమ్మ రాజశేఖర్ నిలవగా, వీరికిచ్చిన టాస్కులో కుమార్ సాయి గెలిచి, ఈ వారం కెప్టెన్ గా మారాడు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో కుమార్ కూడా ఉన్నాడు. మరి ఎలిమినేషన్ లోంచి బయటపడతాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news