BIGG BOSS SEASON 7: శోభాకి కన్నీళ్లు తెప్పించిన నాగార్జున… !

-

బిగ్ బాస్ సీజన్ 7 లో గత రాత్రి ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశనే మిగిల్చి హౌస్ నుండి
రతిక రోజ్ ఎలిమినేట్ అయింది. మొదటి వారం మినహా రతిక రోజ్ ఆటలో చేసింది ఏమీ లేదు, పైగా అందరినీ తనదైన వాగ్వాదంతో విసిగిస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. కాగా శనివారం రాత్రి ఇప్పటికే హౌస్ మేట్స్ గా ఎంపిక అయిన శోభా శెట్టి, శివాజీ, సందీప్ లలో ఒకరిని అన్ డిజర్వ్డ్ గా ప్రకటించాలని కంటెస్టెంట్ ను అందరినీ కోరగా… శివాజీకి ఎక్కువ ఓట్లు అన్ డిజర్వ్డ్ అని పడడడంతో అతన్ని హౌస్ మేట్ నుండి తొలగించి పవర్ అస్త్రను తీసేసుకున్నారు. అయితే రాత్రి శివాజీ నన్ను ఎందుకు అన్ డిజర్వ్డ్ గా ప్రకటించారు సరైన రీజన్ కావాలని అడిగారు. అతడి అభ్యర్థనను స్వీకరించి నాగార్జున అందరినీ కారణాలు చెప్పమన్నారు..

శోభా ను కూడా కారణం చెప్పమని అడిగిన తర్వాత… మీ ఇద్దరినీ కన్విన్స్ చేస్తూ నిర్ణయాన్ని చెప్పమని చెబుతుంటారు.. అని చెప్పడంతో ఇంకా డెప్త్ గా వెళ్లి నాగార్జున కారణాలు అడగడంతో శోభా శెట్టి లేదు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ముగ్గురం కలిసి తీసుకున్నావ్ అనడంతో, నాగార్జున ముగ్గురూ కలిసి తీసుకున్నప్పుడు శివాజీ ఎలా తప్పు అవుతుంది అని అడగడంతో శోభా తప్పు అర్ధమయింది. దీనితో కన్నీటి పర్యంతం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news