వింత సరిహద్దు ప్రాంతం..వద్దు మొర్రో అంటున్న దేశాలు..!

-

సాధరణంగా సరిహద్దుల వివాదాలు మనం వినే ఉంటాం..అది మా పరిధిలోకి వస్తుందంటే మా పరిధిలోకి వస్తుందని గొడవపడతారు. ఇండియా- పాకిస్థాన్ సరిహద్దు వివాదాలు, భారత్- చైనా సరిహద్దు ఘర్షణలను మనం చాలానే చూశాం..కానీ ఇప్పుడు చెప్పే సరిహద్దు వివాదం కాస్త తేడా..ఎందుకంటే… ఈ సరిహద్దు ప్రాంతాన్ని ఏ దేశమూ కోరుకోవట్లేదు. అది ఎవరిదీ కాకుండా ఉంది. ఈ ప్రదేశాన్ని మాకు వద్దంటే, మాకు వద్దంటున్నారు. ఇంతకీ ఈ సరిహద్దు ఎక్కడుంది..ఎందుకు ఆ దేశాలు వద్దంటున్నాయో చూద్దాం..
ఈజిఫ్ట్, సూడాన్ దేశాల మధ్య ఉంది ఈ సరిహద్దు.. దీని పేరు బిర్ తావిల్ (Bir Tawil). దేశాల మధ్యలో ఉన్న ప్రాంతం. రాకపోకలు సాగించేందుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం. అయినా దేశాలు మాత్రం వద్దనే అంటున్నాయి.
Bir Tawil
Bir Tawil

బిర్ తావిల్ ప్రత్యేకత అదే:

బిర్ తావిల్ అంటే… పొడవైన నీటి బావి అని అర్థం. నిజానికి ఇదో ఎడారి. ఇక్కడ ఏ బావీ ఉండదు. మొత్తం 2060 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉంది.. ఈజిఫ్ట్ ప్రభుత్వం, సూడాన్ ప్రభుత్వం… రెండూ కూడా ఈ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా చెప్పుకోలేదు. అందువల్ల దీన్ని అభివృద్ధి చేయడం గానీ, పట్టించుకోవడం గానీ జరగలేదు..ప్రపంచంలోని మరే దేశం కూడా దీన్ని తమ ప్రాంతంగా చెప్పలేదు. అందువల్లే ఇక్కడ ఎవరూ జీవించరు. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధికి ఆమడుగు దూరంలోనే ఉన్నాయి.

సరిహద్దు వేసినప్పుడే సమస్య:

1899లో సూడాన్, ఈజిఫ్ట్ మధ్య రాజకీయ సరిహద్దు వివాదం తలెత్తింది. అప్పటి నుంచి ఈ సమస్య రగులుతూనే ఉంది. మూడేళ్ల తర్వాత… 1902లో ఈజిఫ్ట్… రాజకీయ సరిహద్దు అంటూ… తమవైపు నుంచి ఓ సరిహద్దును వేసేసుకుంది. అదే సమయంలో… సూడాన్ కూడా… తమవైపు నుంచి అదే సరిహద్దును ఓకే చేసుకుంటూ… పరిపాలనా సరిహద్దు పేరుతో… ఆమోదించింది. అయితే బిర్ తావిల్‌ని మాత్రం ఈ రెండు దేశాలూ చేర్చుకోలేదు. అంటే ఇది రెండు దేశాలదీ కావచ్చు లేదా రెండు దేశాలదీ కాకపోవచ్చు అనే వాదన తెరపైకి వచ్చింది.

బ్రిటన్ జోక్యం:

1902 నవంబర్ 4న ఈ వివాదాస్పద ప్రాంతం విషయంలో బ్రిటన్ జోక్యం చేసుకుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా సరిహద్దులను గీసింది. ఈ ప్రదేశాన్ని గిరిజనులు వాడుకునే ప్రదేశంగా చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో అబాబ్దా (Ababda Tribe) గిరిజనులు జీవిస్తున్నారు. వారు ఈజిఫ్టుకి చెందిన వారుగా అంటుంటారు. అందువల్ల బిర్ తావిల్… ఈజిఫ్టుదే అని అంటారు. కానీ దీన్ని ఈజిఫ్టు ప్రభుత్వం ఒప్పుకోలేదు. మరోవైపు… బ్రిటీష్ పరిపాలనా కాలంలో… సూడాన్ గవర్నర్… బిర్ తావిల్‌ను తమ పరిధిలోనిదిగా భావించారు. కానీ ఇప్పుడు సూడాన్ దీన్ని తమదిగా చెప్పుకోవడం లేదు.

 అసలు ఎందుకు వద్దంటున్నారు?

బిర్ తావిల్ ను వద్దనడానికి ఇవి కారణాలు..
  • బిర్ తావిల్ పూర్తిగా ఎడారి ప్రాంతం. అక్కడ నీరు ఉండదు. ఇళ్లు లేవు.
  • ఏం చేసినా అది అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం రెండు దేశాలకూ లేదు.
  •  పైగా ఎవరూ అక్కడ శాశ్వతంగా ఉండేందుకు సిద్ధంగా లేరు.
  • అక్కడ విపరీతమైన ఎండ ఉంటుంది. జూన్ నుంచి ఆగష్టు మధ్యలో ఇక్కడ 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వేడి ఉంటుంది.
  • వేడి ఇసుక గాలులు వీస్తాయి.
  • ఇక సముద్రానికి ఈ ప్రదేశం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల సముద్ర గాలులు కూడా ఇక్కడికి రావు.
  • అక్కడ జీవించడం కష్టమనే అభిప్రాయంలో స్థానికులు ఉన్నారు. ప్రజల నుంచి డిమాండ్ లేకపోవడంతో… ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు.

జెండాపాతి మాదే అంటున్న పర్యాటకులు

ఎవరిదీ కాదు అని క్లారిటీ వచ్చేయడంతో… ప్రపంచ పర్యాటకులు బిర్ తావిల్ వెళ్లి… తమ సొంత జెండాను అక్కడ పాతుతుంటారు. అది తమ దేశం అని సరదాగా చెప్పుకుని..అలా ఫొటోలు తీసుకుంటారు. అదో చిన్న దేశంగా ప్రకటించుకుంటారు. దీనిపై ఏ దేశానికీ అభ్యంతరాలు లేవు. అందువల్ల పర్యాటకులపై ఎలాంటి కేసులూ ఉండవు. సరిహద్దుల కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న ఈ రోజుల్లో… ఇలాంటి ఓ ప్రదేశం ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే..!

Read more RELATED
Recommended to you

Latest news