లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

-

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ నేతలు.. లేదు త్వరలోనే ఈ కేసులో చంరబాబు ప్రమేయం ఏమీ లేదని తీర్పు వస్తుందని టీడీపీ నేతలు పరస్పర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ తండ్రి అరెస్ట్ అనంతరం నారా లోకేష్ భయంతో పరిగెత్తుకుంటూ ఢిల్లీ వెళ్లాడని కామెంట్ చేశాడు. ఢిల్లీ కి ఎందుకు లోకేష్ వెళ్ళాడో అందరికీ తెలుసు, కేవలం భయంతోనే నన్నెక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తారని ఢిల్లీ కెళ్ళి దాక్కున్నాడు అంటూ ఆరోపణలు చేశారు సిద్దార్ధ రెడ్డి. ఈ కేసులతో నాకేమి సంబంధం అంటున్న లోకేష్ కు … గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఐటీ శాఖామంత్రిగా ఉన్న లోకేష్ కు స్కిల్ స్కాం మరియు ఏపీ ఫైబర్ లాంటి స్కాం లతో సంబంధం ఎందుకు లేదంటూ ప్రశ్నించాడు బైరెడ్డి .

ఇక చంద్రబాబు అరెస్ట్ ను మాత్రమే తప్పుబట్టే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ స్కాం లు కనిపించకుండా పోయాయా అంటూ కామెంట్ చేశాడు బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news