మ‌హబూబ్‌న‌గ‌ర్‌లో నేడు బీజేపీ ఆందోళ‌న‌

-

రాష్ట్రంలో నెల‌కొన్న నిరుద్యోగ‌, ఉపాధ్యాయ, ఉద్యోగ స‌మ‌స్య‌లను వ్య‌తిరేకిస్తు నేడు రాష్ట్ర బీజేపీ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఆందోళ‌న చేయ‌నున్నారు. ఈ ఆందోళ‌న కార్యక్ర‌మానికి మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ రానున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉద్యోగ‌, నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ నాయకులు అన్నారు. అందుకే మంగ‌ళ వారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఆందోళ‌న చేస్తామ‌ని తెలిపారు. అయితే మంగ‌ళవారం మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ‌ణ‌వీస్ రాష్ట్రానికి రానున్నారు.

హైద‌రాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా మ‌హాబూబ్ న‌గ‌ర్ కు చేరుకుంటారు. మ‌హాబూబ్ న‌గ‌ర్ లోని ఎనుగొండలో గ‌ల జేజేఆర్ గార్డెన్స్ లో రాష్ట్రంలో నెల‌కొన్న నిరుద్యోగ‌, ఉద్యోగ, ఉపాధ్యాయ స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న చేయ‌నున్నారు. ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం 12:30 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. కాగ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌తి రోజు బీజేపీ అగ్ర నాయ‌కులు రాష్ట్రానికి వస్తున్నారు. అలాగే ఈ నాయ‌కులు తెలంగాణ ప్ర‌భుత్వం పై చేసే నిర‌స‌న కార్యక్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news