బిగ్ బ్రేకింగ్ : 9వ రౌండ్ లో బీజేపీకి భారీ లీడ్

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఎనిమిదో రౌండ్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ లీడ్‌ లోకి రాగా… తాజాగా ప్రకటించిన తొమ్మి దో రౌండ్‌ ఫలితాల్లో మాత్రం… భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్‌ లీడ్‌ లోకి వచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో… టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లోనూ.. ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

etala

ఇక ఈ 9 వ రౌండ్‌ లో ఈటల రాజేందర్‌ కు ఏకంగా 1835 ఓట్ల మెజారిటీని సాధించారు. దీంతో ఓవరాల్‌ గా 5105 ఓట్ల ఆధిక్యాన్ని ఈటల రాజేందర్ సంపాదించుకున్నారు. తొలిసారి అన్ని రౌండ్లను మించి ఆధిక్యత సంపాదించారు ఈటల రాజేందర్‌. అయితే.. ఈ 9 వ రౌండ్‌ ముగిసే సరికి… ఈటల రాజేందర్‌ కు ఏకంగా మొత్తం 40412 ఓట్లు సంపాదించారు. అటు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి  గెళ్లు శ్రీనివాస్‌ 35307 ఓట్లు సంపాదించారు.  9 రౌండ్లు ముగిసే సరికి…  కాంగ్రెస్‌ పార్టీ కేవలం 1349 ఓట్ల సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news