బీజేపీ హై కమాండ్: ప్రతిఒక్కరూ సీటు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే !

-

తెలంగాణాలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపు విషయంలో బిజీ బిజీ గా ఉన్నారు. ఇక బీజేపీ లో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే బీజేపీ సీట్లు ఆశించే వారు దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అప్లై చేసుకుంటూ ఉండగా, కొందరు ఖచ్చితంగా టికెట్ మాకే అని భావిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోకపోవడాన్ని బీజేపీ హై కమాండ్ గమనించింది. దీనితో వెంటనే తెలంగాణ బీజేపీ చీఫ్ కు హుకుం జారీ చేసింది. ఎంతటి నాయకుడు అయినా ఖచ్చితంగా బీజేపీ తరపున పోటీ చేయాలి అనుకుంటే దరఖాస్తు చేసుకోవాల్సిందే అంటూ కిషన్ రెడ్డికి చెప్పారు, ఈ విషయాన్ని సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ చెప్పడంతో, అలర్ట్ అయ్యారు. వెంటనే అందరూ దరఖాస్తు చేసుకోవాలి అంటూ కిషన్ రెడ్డి అధిష్టానం మాటగా చెప్పారు.

ఇక బీజేపీ నేతలు దరఖాస్తు చేరుకోవడానికి మంచి ముహూర్తాల కోసం వెతుక్కుంటున్నారు. మరి ఎవరెవరికి ఈ ఎన్నికల్లో సీట్లు దక్కనున్నాయి తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version