రాహుల్ తెలంగాణ పర్యటనపై సెటైర్లు వేసిన బీజేపీ నేత..

-

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో.. బీజేపీ, టీఆర్ఎస్ లపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ తెలంగాణ టూర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో రాహుల్‌ సభలు వృథా ప్రయాసని.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒక గూటి పక్షులేనని ఎద్దేవా చేశారు లక్ష్మణ్.

తెలంగాణలో గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్, అధికారంలో ఉన్నప్పుడు చేయని పనుల్ని ఇప్పుడు చేస్తా మంటే నమ్మే వారెవరూ లేరని లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు త్వరలోనే తప్పకుండా కలుస్తాయన్న లక్ష్మణ్‌ .. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version