కంగ‌న పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత‌

-

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న రౌన‌త్ అంటే ప్ర‌స్తుత రోజుల‌లో తెలియని వారు ఉండ‌రు. ఆమె సినిమా ల ద్వారా తెచ్చుకున్న‌ పాపులారీటి కంటే తాను చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వ‌ల్లే ఎక్కువ పాపులారీటి వ‌చ్చింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే ఇటీవ‌ల హీరోయిన్ కంగ‌న రౌన‌త్ స్వాతంత్య్రం విష‌యంలో వివాదాస్ప‌ద కామెంట్స్ చేసింది. భార‌త దేశానికి స్వాతంత్య్రం 1947 రాలేద‌ని.. 2014 లోనే వ‌చ్చింద‌ని అన్నారు. అయితే ఈ కామెంట్స్ మోడీ ప్ర‌భుత్వం గురించి చేసిన‌ట్టు స్ప‌ష్టం గా తెలుస్తుంది.

అయితే కంగ‌న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల ను వ్య‌తిరేకిస్తు సామాన్య‌లు.. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు తీవ్రం గా స్పందించారు. అయితే తాజాగా ఒక బీజేపీ నేత కూడా ఈ వివాదాస్పద కామెంట్స్ పై స్పందించింది. కంగ‌న రౌన‌త్ పూర్తి గా త‌ప్పుగా మాట్లాడుతుంద‌ని బీజేపీ ఢిల్లీ ప్ర‌తినిధి నిఘ‌త్ అబ్బాస్ అన్నారు. మోడీ కూడా గాంధీజీ బోధ‌న‌ల‌తో స్ఫూర్తి పొంద‌రాని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల అంత‌ర్జాతీయం స్థాయి లో దేశం ప‌రువు పోతుంద‌ని అన్నారు. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు కంగ‌న వ్యాఖ్య‌ల పై ఏ బీజేపీ నాయక‌లు కూడా స్పందిచ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news