BREAKING : టీఆర్ఎస్ గూటికి రాపోలు ఆనంద్ భాస్కర్

-

తెలంగాణ బీజేపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాషాయం కండువా తీసేసి చాలా మంది నేతలు కారెక్కుతున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రావు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాపోలు కారెక్కారు. కేటీఆర్ రాపోలుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అంతకుముందు కేసీఆర్ తో ప్రగతి భవన్ లో రాపోలు భేటీ అయ్యారు. చేనేత రంగం అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు.  రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. బీఆర్ఎస్ తో  జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ప్రధాన పాత్ర వహించాలని రాపోలు ఆనంద్ భాస్కర్ కోరారు.

జర్నలిస్ట్ గా పనిచేసిన ఆనంద భాస్కర్ రావు 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీజేపీలో చేరారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news