కరోనాకు మరో ఎమ్మెల్యే బలి.. మొన్ననే భార్య కూడా !

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కేసులు కోటికీ చేరువ అవుతున్నాయి. అయితే మొదట్లో సామాన్యులకే పరిమితం అయిన ఈ కరోనా కేసులు లాక్ డౌన్ ఎత్తివేసిన క్రమంలో తన మన బేధం లేకుండా అందరికీ సోకుతున్నాయి. అయితే ఎక్కువ మంది ఈ వైరస్ ప్రభావం నుండి కోలుకుంటున్నారు. కానీ కొంత మంది దానికి బలయిపోతున్నారు. దేశంలో చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ క్యాబినెట్ మంత్రులు కూడా దీనికి బలయ్యారు.

ఇక చాలా రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉత్తరాఖండ్ కి చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే తన ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ గంగారాం ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. అయితే బాదించే మరో విషయం ఏమిటంటే ఈయన భార్య కొద్ది రోజుల క్రితమే గుండె పోటు వచ్చి మరణించింది. ఈయన ఆల్మోరా జిల్లాకి చెందిన సాల్ట్ అనే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news