ఒకేసారి ఇద్దరితో ఎఫైర్.. మహిళ దారుణ హత్య

-

ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు హత్యలకు ఎక్కువగా కారణం అవుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా క్షణిక సుఖాల కోసం వెంపర్లాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా భువనగిరి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గుట్టలల్లో లక్ష్మి (35) అనే మహిళ దారుణ హత్యకు గురయింది. అక్రమ సంబంధమె ఈమె ప్రాణాలు తీసిందని అంటున్నారు. ఈమెను హత్య చేసి పోలీసులకు లొంగి పోయాడు ఈమె ప్రియుడు కుమార్.

జనగామ జిల్లా దేవరుప్పుల (మ) పెద్ద మాటురు గ్రామానికి చెందిన లక్ష్మీ భర్త చనిపోవడంతో కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఇతను ఉండగానే మహబూబ్ నగర్ కు చెందిన విజయ్ అనే యువకుడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే తాను ఉండగా అలా చేయడం అంటే తనను మోసం చేసినట్టేననే కోపంతో లక్ష్మీ హత్య చేశాడు కుమార్. లక్ష్మిని బ్లేడ్ తో గొంతు కోసి తల పై బండరాయి వేసి హత్య చేశాడు కుమార్. కుమార్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సంఘటన స్థలం వద్ద బీరు బాటిల్, కూల్ డ్రింక్, బ్యాగ్ లభించాయి. ఇక స్వయంగా చంపిన వాడే వచ్చి లొంగిపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news