శామీర్ పేటలో నిన్న దొరికిన డబ్బు బీజేపీదే : డీసీపీ

-

శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులకు చిక్కిన రూ.40 లక్షల కేసులో కీలక అంశాలు వేలుగులోకి వచ్చాయి. రూ.40 లక్షలతో పట్టుబడ్డ నలుగురు నిందితులను విచారించామన్న డీసీపీ పద్మజ ఈ డబ్బు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘు నందన్‌ రావుకు ఇచ్చేందుకు నిందితులు తీసుకెళ్తున్నారని ఆమె తెలిపారు.

అలానే నిందితులతో రఘునందన్‌రావు పీఏ సంతోష్ ఫోన్ సభాషణ గుర్తించామన్న ఆమె ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు తరలిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. శామీర్‌పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌టాక్స్ సమీపంలో రెండు కార్లలో రూ. 40లక్షలు తరలిస్తున్న వారిని నిన్న ఎస్‌ఓటి పోలీసులు సోమవారం సాయంత్రం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  పఠాన్‌ చెరు నుండి దుబ్బాక కు తరలిస్తుండగా ఈ నగదును స్వాధీనం చేసుకుని వారిని పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news