బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరో షాక్ తగిలింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. ‘మరికాసేపట్లో నిన్ను లేపేస్తాం’ అంటూ.. రెండు నంబర్ల నుంచి ఫోన్కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగార్ ఆపాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పంటూ వార్నింగ్ ఇచ్చారు.

తమ టీమ్లు హైదరాబాద్లోనే ఉన్నాయని.. దమ్ముంటే కాపాడుకోవాలని..రెండు నంబర్ల నుంచి రఘునందన్ రావుకి వచ్చిన బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు.