BREAKING : కరోనా కాటుకు బీజేపీ ఎంపీ బలి..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా ఈ మహమ్మారి బారిన పడి బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ (55) మరణించారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అశోక్ గస్తీ సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా, కొద్దిరోజుల క్రితం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయన ఎన్నికయ్యారు. ఇకపోతే బుదవారం నాడు కరోనా బారిన పడి తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news