గ్రేటర్ వార్ : పక్క రాష్ట్రాల నుండి జనాన్ని దింపిన బీజేపీ

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు దిగినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ శా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అంతే కాక ఇప్పటికే బిజెపి ఇతర రాష్ట్రాల నేతలను కొన్ని డివిజన్లకు ఇన్చార్జిలుగా నియమించింది.

వారంతా తమ వెంట తమ రాష్ట్రాల నుంచి కార్యకర్తలను జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం కోసం తీసుకొచ్చుకున్నారు. తమకు అప్పగించిన డివిజన్లలో స్థానిక డెవలప్మెంట్ ని ఎప్పటికప్పుడు తమ ఇన్చార్జ్ లకు ఆయా రాష్ట్రాల కార్యకర్తలు అప్ డేట్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే బీజేపీ జాతీయ నేత తేజస్వి సూర్య కూడా తెలంగాణలో తమ ప్రచారం మొదలుపెట్టారు. నిన్న ఆయన ఎంఐఎం మీద టీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. 

Read more RELATED
Recommended to you

Latest news