నేడు బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం

-

బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం నేడు జరగనుంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్లమెంట్ కన్వీనర్, ప్రభారీ, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో… సునీల్ బన్సల్ భేటీ అవుతారు.

ప్రవాస్ యోజన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు… అమిత్ షా పర్యటనపై చర్చించనున్నారు. ఈ నెల 23న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాను రప్పించేందుకు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో అమిత్ షా పర్యటన పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తారా… లేదా అనేది సందిగ్ధంగా మారింది. ఈ రోజు జరిగే సమావేశం అనంతరం… అమిత్ షా పర్యటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news