సికింద్రాబాద్ లో పేలుడు కలకలం

-

హైదరాబాద్ లో నిన్నటి పేలుడు ఘటన మరువక ముందే మరో పేలుడు సంభవించింది. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద డస్ట్ బిన్ లో పేలుడు సంభవించింది. డస్ట్‌బిన్ లో ఉన్న ఓ టిన్నర్ డబ్బా వలన ఈ పేలుడు సంభవించిందని చెబుతున్నారు. చెత్తను వేరుకునే ఓ వ్యక్తి డబ్బాను ఓపెన్ చేసే సమయంలో డబ్బా పేలిందని అంటున్నారు.

ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రి తరలించారు. ఇక నిన్న హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని అస్బెస్టాస్ కాలనీ ఆటోలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆటోలో ఎక్కుతున్న యూసూఫ్ అలీ అనే వ్యక్తి కాలికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీం, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కొన్ని శాంపిల్స్ ను సేకరించారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news