సలార్-2పై ఆసక్తికర విషయాలు చెప్పిన బాబీ సింహా

-

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది.అయితే ‘సలార్’ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో సినిమాపై నటుడు బాబీ సింహా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘సలార్ క్లైమాక్స్లో 10 నిమిషాలు గూస్బంప్స్ వచ్చాయి కదా.. సీక్వెల్లో ఇలాంటివి 100 రెట్లు ఉంటాయి అని అన్నారు. ఇది అతిశయోక్తిగా అనిపించినా సెట్టింగ్స్, గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ లో భారీగా ఉంటాయి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news