నకిలీ ఫాలోవర్స్​ స్కామ్ లో బాలీవుడ్​ ర్యాపర్​​ బాద్​షా కు సమన్లు జారీ..!

-

సోషల్​ మీడియాలో నకిలీ ఫాలోవర్స్​ స్కామ్​ లో భాగంగా ప్రముఖ ర్యాపర్​ బాద్ ​షా కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో స్టేట్​మెంట్​ను రికార్డు చేసేందుకు క్రైమ్​ బ్రాంచ్​ ఎదుట హాజరు కావాలని అతడికి చెప్పారు. కొన్ని వారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో నకిలీ, పెయిడ్ ఫాలోవర్స్​కు సంబంధించిన విషయమై ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ రాకెట్​లో బాలీవుడ్​కు చెందిన ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

badhsha
badhsha

కొన్ని రోజుల క్రితం గాయని భూమి త్రివేది, ఆన్​ లైన్​ లో​ తన పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్​ గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు మీద ఓ నకిలీ ఇన్​స్టాగ్రామ్​ పేజీని సృష్టించి నెటిజన్లతో గుర్తుతెలియని వ్యక్తి చాట్​ చేశాడని తెలిపింది. ఆ సందేశాల స్క్రీన్ ​షాట్ల​నూ అందులో పోస్ట్​ చేశారని కంప్లైంయింట్​లో పేర్కొంది. బాలీవుడ్​ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా 176 మంది సెలబ్రిటీలు సోషల్​మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్​ ను పొందేందుకు డబ్బు చెల్లించారని ముంబయి పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news