ప‌బ్‌జి గేమ్ సౌండ్ చేయ‌కుండా ఆడుకోవాల‌ని కోరినందుకు చంపేశారు..!

-

ప్ర‌ముఖ మొబైల్ గేమ్ ప‌బ్‌జి యూజ‌ర్ల‌లో హింసాత్మ‌క ప్రవృత్తిని ప్రేరేపిస్తోంది. అడ‌పా ద‌డ‌పా అందుకు సంబంధించిన సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇలాంటిదే మ‌రొక సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌బ్‌జి గేమ్ ఆడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఓ వ్య‌క్తి అల్ల‌రి చేయ‌వ‌ద్ద‌ని కోరాడు. అందుకు ఆగ్ర‌హించిన ఆ ముగ్గురు అత‌న్ని దారుణంగా చంపేశారు. వివ‌రాల్లోకి వెళితే…

3 persons killed one for asking them to be quiet while playing pubg

జ‌మ్మూలోని ఆర్ఎస్ పుర తాలూకా బ‌ద్యాల్‌ క‌జియాన్ గ్రామంలో రాజ్ కుమార్‌, విక్ర‌మ్ జీత్‌, రోహిత్ కుమార్ అనే ముగ్గురు ప‌బ్‌జి మొబైల్ గేమ్ ఆడుతున్నారు. అయితే వారు పెద్ద‌గా శ‌బ్దం చేస్తుండ‌డంతో శ‌బ్దం చేయ‌వ‌ద్ద‌ని ప‌క్క‌నే ఉన్న ద‌లీప్ రాజ్ వారిని కోరాడు. అయితే అందుకు ఆగ్ర‌హించిన ఆ ముగ్గురు ద‌లీప్ రాజ్‌ను లావుపాటి క‌ర్ర దుంగ‌తో కొట్టి చంపేశారు.

కాగా ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఇక ఈ గేమ్ వ‌ల్ల ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. గ‌తంలో ప‌లువురు యువ‌కులు త‌మ కుటుంబ స‌భ్యుల అకౌంట్ల నుంచి రూ.ల‌క్ష‌ల డ‌బ్బును ఈ గేమ్ కోసం ఖ‌ర్చు చేసిన సంఘ‌ట‌న‌లు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్ప‌డు ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news