ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు..సజ్జలపై ఏపీ ఉద్యోగుల ఫైర్‌

-

సజ్జలపై పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి.. ప్రస్తుతానికి పాత జీతాలే ఇవ్వాలని సీఎస్సును కోరామని.. సీఎస్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని వెల్లడించారు. ప్రభుత్వం వేసివ సంప్రదింపుల కమిటీకి మా స్టీరింగ్ కమిటీ బృందం వెళ్లి లేఖ ఇచ్చింది.. దానికీ సమాధానం లేదని.. సమాధానాలు చెప్పకుండా.. మమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

చర్చలకు వెళ్లమని మాపై ఒత్తిడి తేవాలని ఉద్యోగులను సజ్జల కోరుతున్నారని.. సజ్జల చుట్టూ చర్చల కోసం మేం తిరగలేదా..? అని నిలదీశారు. ప్రతి అంశం పైనా సజ్జల మాతో చర్చింది వాస్తవం కాదా..?
మధ్యంతర భృతిని వెనక్కు తీసుకున్నది వాస్తవం కాదా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేం అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. మేం మెచ్యూర్డుగా వ్యవహరించ లేదని సజ్జల అంటారా..? మేం సజ్జలతో చర్చలు జరిపినప్పుడు.. మేం మెచ్యూర్డో.. ఇమ్మేచ్యూర్డో తెలీదా..? అని నిప్పులు చెరిగారు. ఇది చాలదన్నట్టు మరిన్ని ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతామంటారా..? ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు..? అని ఆగ్రహించారు. మా ఉద్యోగులు మమ్మల్ని విమర్శిస్తోన్నా.. సమస్య పరిష్కారం కోసం మేం చర్చలకు రాలేదా..?అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను కించ పరచవద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news