బొత్స సత్యనారాయణ అక్రమాలకు పాల్పడుతున్నారు – నాగార్జున

-

విజయనగరం: బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున. తన కుటుంబానికి ఏపీఐఐసీ నుంచి కారుచౌకగా భూములను కట్టబెడుతున్నారని అన్నారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో 30 ఎకరాలు భూమిని బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ఎకరా కోటి రూపాయలు ఖరీదు ఉన్న 30 ఎకరాలు భూమిని కేవలం 10 లక్షలుకే అప్పనంగా దోచిపెట్టారని అన్నారు.

ప్రత్యేక జి.ఓ ద్వారా ఆయన కుటుంబీకులకి చెందిన సత్య బయో కెమికల్స్ అనే కంపెనీకి 30 ఎకరాలు ఇచ్చేసారన్నారు. స్థానికులు చెపుతున్న మాటల ప్రకారం ఎకరా మూడు కోట్లు వరకు పలుకుతునట్లు తెలిసిందన్నారు. జిల్లాలో ఉన్న ఫెర్రో కంపెనీలకి రాయితీ ఇవ్వలేక మూసేసిన పరిస్థితి కనబడడం లేదా..? అని ప్రశ్నించారు. వాటిని ఎందుకు ఆదుకోవడం లేదన్నారు నాగార్జున. ఈ జి.ఓ వెంటనే రద్దు చేసి భూములు వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news