ఏపీ మంత్రి బొత్స: ఎమ్మెల్యేలు అలగడం మామూలే… పూర్తి బాధ్యత వారిదే !

-

గత కొంతకాలంగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలిగారని, టీడీపీ తో టచ్ లో ఉన్నారని, జగన్ మీద కోపంగా ఉన్నారని ఇలా రకరకాలుగా వార్తలు వినబడుతున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు ఉండే అవకాశం లేకపోలేదు. అలా జగన్ మీద కోపంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా మీడియా సమావేశంలో తమ ఆవేశాన్ని వెళ్లగక్కగా, ఇంకో ఇద్దరు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి తమ ఆవేశాన్ని తెలియచేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ఎమ్మెల్యేలు అలగడం అనే విషయం మీద మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్ చేశాడు. ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా వివిధ కారణాల చేత అలగాడం మామూలే. అయితే ఇలా లైగిన ఎమ్మెల్యేలను బుజ్జగించడం మరియు వారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాత్రం పూర్తిగా రీజనల్ కో ఆర్డినేటర్ లదే నని సంచలన కామెంట్స్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news