బీజేపీకి మ‌ద్ద‌తుగా ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ..

-

కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 5వతేదీన నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ బ్రహ్మానందం, బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురలో రోడ్ షో నిర్వహించిన ఆయన, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

బ్రహ్మానందం వచ్చాడని తెలుసుకున్న ప్రజలు, ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో సందడి వాతావరణం కనిపించింది. ఇక బెంగళూరు యశ్వంతపుర నుంచి తమ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఎస్టీ సోమశేఖర్ తరఫున సీఎం యడియూరప్ప ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ సైతం, తమ స్థానాలను నిలుపుకోవాలన్న లక్ష్యంతో శ్రమిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news